29, డిసెంబర్ 2012, శనివారం

కవి పరిచయం.

రాత్రి సూర్యుడు కవి పరిచయం. 

అనంతపురం జిల్లా రాయదుర్గంకి చెందిన కేరే జగదీశ్ (సీనియర్ పాత్రికేయుడు) కస్తూరి పరిమళం (కన్నడిగుడు) అయినప్పటికీ తేనెలొలుకు పలుకులలో కవిత్వం రాస్తున్నారు.

ఆయన తన హృదయాన్ని "సముద్రమంత గాయం " ని చేసుకుని బడుగు జీవుల చిత్రాలు చిత్రించారు. 

ఒక కవి పరిచయం తో.. స్ఫూర్తి పొంది "రాత్రి సూర్యుడు " దీర్ఘ కవిత వ్రాయడానికి శ్రీకారం చుట్టారు. 

అంధుల  అంతః ప్రపంచాన్ని భౌతిక ప్రపంచానికి చూపడానికి ఈ దీర్ఘ  కవిత రాసారు. 

శిశిరంలో కోయిల కూస్తే.ఎడారిలో పూలు పూస్తే .. చీకటి వెలుగవదా !? శాపం వరమవదా !? గుండె గాయం మధుర గేయం అవదా!? 

అదే ఈ రాత్రి సూర్యుడు. 

ఆయన కన్నీటి మేఘాల నుండి ఉదయించిన అక్షర సూరీడే ..ఈ రాత్రి సూరీడు. 

మా ఆత్మ విశ్వాస నక్షత్ర ధగ దగాలు 

మా ఉశ్వాస నిశ్వాసాలు రెప రెపలాడే ఈ విజయాల జెండాలు ఈ కవితలోని అక్షరాలు అంటారు.. ఈ కవికి స్పూర్తిగా నిలిచిన మరొక అంధ కవి. 





kere jagadeesh


అక్షర సూర్యుడు దీర్ఘ కవిత .. ఆవిష్కరణ జరుగుతున్న తేదీ డిసెంబర్ 30 

 రాయ దుర్గం, అనంతపురం జిల్లా 

ఆవిష్కరణ : బుడుగి శ్రీనివాసులు  {జర్మనీ రాయబారి )

ఈ దీర్ఘ  కవిత కి  ముందు మాట వ్రాసిన వారు..  కె. శివా రెడ్డి గారు అద్దేపల్లి రామమోహనరావు గారు. 

సాహితీ మిత్రులందరికీ ఇదే మా ఆహ్వానం

 .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి