28, నవంబర్ 2012, బుధవారం

మౌనశ్రీ మల్లిక్ స్పందన

నిశీధి శిలాజాల అన్వేషి

ఆతను చీకట్లో అక్షరాల విత్తనాలను జల్లి
కవితా కుసుమాలు పూయిస్తాడు

ఆకాశంలో పరచుకున్న నక్షత్ర గ్రంధాలను
నిశీధి వేళ  మనోనేత్రంతో పఠిస్తాడు
యుగాంతాల  రహస్యాలను చదివి
దిగంతాలను మేల్కొల్పే
కవనగానాలు చేస్తాడు.

ఒక కంట్లో కరుణ మరొక కంట్లో ప్రేమ
ఆటుపోట్లు సంభవిస్తుంటే
కల్లోలిత హృది సముద్రంలో అస్తమిస్తూ..
మానవత్వ శిలాజాల వెతుకులాటలో
నిత్యనూతనంగా ..ఉదయిస్తాడు.
అతడే మోపూరు.
                     _మౌనశ్రీ  మల్లిక్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి